
త్వరిత స్కలనం సమస్య పురుషులకే కాదు, మహిళలక్కూడానట. తాజాగా చేసిన అధ్యయనంలో ఆశ్చర్యపడే రీతిలో అతివలు చాలామంది ముట్టుకుంటే చాలు తమంత తామే ముంచేసుకుంటున్నారట. ఇంతవరకూ పురుషులందరూ మహిళకు స్కలనం అవటమంటే, ఎంతో ఫోర్ ప్లే కావాలని, సమయం తీసుకుంటుందని భావించేవారు. ఈ విషయం అందరకూ వర్తించకపోవచ్చు.
పోర్చుగల్ లోని మగలాయీస్ లెమోస్ హాస్పిటల్ తాజాగా ఒక సర్వే నిర్వహించింది. అందులో 510 మంది మహిళల స్కలన తీరుతెన్నులు పరిశీలించింది. పరిశోధనలో 40 శాతం మహిళలు ముందుగానే గేమ లో అవుట్ కాగా 3 శాతం తమ సమస్య ఎప్పటినుండోనే వుందని క్రానిక్ అని తెలియపరచినట్లు హాస్పిటల్ వర్గాలు తెలిపిన విషయాన్ని దిడైలీ మెయిల్ పత్రిక ప్రచురించింది.
ప్రాచీనకాలంనుండి, రతిక్రీడలాచరణలో ముందస్తుగానే స్కలనం చేసేసుకోవడం పురుషుడి సమస్యగా వుండేది. అయితే ఇది పురుషులకేనా, మహిళలకు కూడా వుందా అనేది ఇపుడు పరిశోధకుల పరిశోధనలో తేలింది. 18 నుండి 45 సంవత్సరాల వయసున్న మహిళలకు పరిశోధకులు తమకు రతిక్రీడ సమయంలో అది మొదలుపెట్టిన సమయంనుండి భావప్రాప్తి అయిన సమయం తెలుపాలంటూ ఒక ప్రశ్నాపత్రం పంపారట. అందులో అమ్మళ్ళు పురుషులు ముట్టటమేమిటి మాకు చిత్తడే...ఛీ పాడు... అంటూ విపరీతమైన వ్యధకు లోనయ్యారని పరిశోధకులు వెల్లడించారు.
ఆవించిన సమయంకంటే కూడా అతి త్వరగా 40 శాతం మహిళలు అవుట్ అయ్యారని పరిశోధకులు తమ ఫలితాలుగా నమోదు చేసుకున్నారు. పురుషుల్లో ఈ సమస్య ఎంత తీవ్రంగా వుందో మహిళల్లో కూడా అలానే వుందని రీసెర్చి టీమ్ లీడర్ సెరాఫేమ్ కార్ వాలోలైవ్ సైన్స్ మేగజైన్ కు వెల్లడించారు. ఈ స్టడీని సెక్సాలజీస్ అనే జర్నల్ లో కూడా ప్రచురించారట.



Click it and Unblock the Notifications



