•  

దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు తాపి ధర్మారావు అభిప్రాయాలు

Sex is important to women
 
హైదరాబాద్: ఆయా ప్రాచీన సంస్కృతులు చాలా వాటిలో కూడా స్త్రీలస్వామ్యమూ సంభోగ స్వేచ్ఛా, దేవతారాధనకు సంభోగమే ముఖ్యసాధన అన్న అభిప్రాయమూ - ఇవి స్ఫుటంగా కనిపిస్తాయి. దేవాలయాలు ఆ విధంగా క్రీడా మందిరాలుగా ఉండేవని లిఖిత పూర్వకమైన లెక్కలు ఉన్నాయి. సంభోగము పవిత్రమైన దైవభక్తికి సూచన. దానిని జరపని వారు పావులు అన్న మాట.

ఆ రోజుల్లో దేవుడిని పురుష భాగంగా భావించేవారు. దేవుడనేది ఒక గొప్ప పురుషాంగం. ఆ పురుష భాగమే మన దేవతానామాలతో లింగం అయింది. ఆ స్త్రీ భాగమే పానవట్టం అంటున్నాం. ఇవి ముద్దుపేర్లు. వీటి ఆకారాన్ని బట్టి ఆ రెండూ ఏమిటో తెలియనే తెలుస్తూ ఉంది.

పూజలకి మూలాధారాలు జగన్నాథంలో చూడండి. వస్తూ వస్తూ రథం ఆగిపోతుంది. ఇకను చెలరేగుతాయి తిట్లు. ఆ సమయంలో తిట్టనివాడు పాపాత్ముడే అనుకునేవారు. పిండి వంటలు చేసుకున్నా, ఈ భూతు బుద్ధి తప్పదు. స్త్రీ అవయవాల్లాగా, పురుష అవయవాల్లాగా పిండివంటలు, మిఠాయిలు తయారు చేసుకుంటారు. వాళ్లలో వాళ్లు పంచుకుంటారు. దేవతలకు సమర్పిస్తారు. తింటారు. అలా పంచినందువల్లా, దేవతలకు సమర్పించినందువల్లా, ఆ స్త్రీ అవయవాలకు అంటిపెట్టుకొని ఉండే దోషాలు తొలగిపోతాయని వారి నమ్మకం. ఇప్పటికీ మనలో ఆడపిల్లలు సమర్త అయినప్పుడు చిమ్మిలి దంచి స్త్రీ అవయవాల రూపంలో చేసి అవయవ దోష పరిహారార్థం ఇతరులకు పంచి పెట్టడం ఆచారం.

Story first published: Wednesday, September 15, 2010, 16:20 [IST]

Get Notifications from Telugu Indiansutras