
ఆ రోజుల్లో దేవుడిని పురుష భాగంగా భావించేవారు. దేవుడనేది ఒక గొప్ప పురుషాంగం. ఆ పురుష భాగమే మన దేవతానామాలతో లింగం అయింది. ఆ స్త్రీ భాగమే పానవట్టం అంటున్నాం. ఇవి ముద్దుపేర్లు. వీటి ఆకారాన్ని బట్టి ఆ రెండూ ఏమిటో తెలియనే తెలుస్తూ ఉంది.
పూజలకి మూలాధారాలు జగన్నాథంలో చూడండి. వస్తూ వస్తూ రథం ఆగిపోతుంది. ఇకను చెలరేగుతాయి తిట్లు. ఆ సమయంలో తిట్టనివాడు పాపాత్ముడే అనుకునేవారు. పిండి వంటలు చేసుకున్నా, ఈ భూతు బుద్ధి తప్పదు. స్త్రీ అవయవాల్లాగా, పురుష అవయవాల్లాగా పిండివంటలు, మిఠాయిలు తయారు చేసుకుంటారు. వాళ్లలో వాళ్లు పంచుకుంటారు. దేవతలకు సమర్పిస్తారు. తింటారు. అలా పంచినందువల్లా, దేవతలకు సమర్పించినందువల్లా, ఆ స్త్రీ అవయవాలకు అంటిపెట్టుకొని ఉండే దోషాలు తొలగిపోతాయని వారి నమ్మకం. ఇప్పటికీ మనలో ఆడపిల్లలు సమర్త అయినప్పుడు చిమ్మిలి దంచి స్త్రీ అవయవాల రూపంలో చేసి అవయవ దోష పరిహారార్థం ఇతరులకు పంచి పెట్టడం ఆచారం.



Click it and Unblock the Notifications




